పాకిస్తాన్ కు బిగ్ షాక్.. 7 వికెట్లు డౌన్

by Muthe.Rajitha |

నేడు జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి దాదాపుగా ఖరారైంది.

పాకిస్తాన్ కు బిగ్ షాక్.. 7 వికెట్లు డౌన్
X

దిశ, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగా.. లక్ష్య సాధనలో పాక్ చతికిల పడింది. 13 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 14 ఓవర్లకు 89 పరుగులు మాత్రమే చేసిన పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రమే 44 పరుగులు చేసాడు. షాదాబ్ 14 పరుగులు చేయగా మిగిలిన వాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఎలాంటి అద్భుతాలు జరగకపోతే మ్యాచ్ భారత్ సొంతం కావడం దాదాపు ఖాయం అయినట్టే కనిపిస్తోంది.

Next Story