- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి : ఏసీపీ మాధవి
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, తమ ఉజ్వల భవిష్యత్తును వృధా చేసుకోకూడదని హుజురాబాద్ ఏసీపీ మాధవి సూచించారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, తమ ఉజ్వల భవిష్యత్తును వృధా చేసుకోకూడదని హుజురాబాద్ ఏసీపీ మాధవి సూచించారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు "మత్తు పదార్థాల వినియోగం-దుష్పరిణామాలు" అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గంజాయి, సిగరెట్లు వంటి మత్తుపదార్థాలను వినియోగించడం చట్టరీత్యా నేరమని ఏసీపీ స్పష్టం చేశారు. క్షణికానందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దని విద్యార్థులకు హితవు పలికారు.
పెడదారిన పడితే కుటుంబానికి, సమాజానికి నష్టం.. సీఐ కరుణాకర్
పట్టణ సీఐ కరుణాకర్ మాట్లాడుతూ యువత పెడదారిన పడితే వారు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడి అలవాట్లకు లోనై సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించవద్దని కోరారు.
ఆకర్షణలకు లోనవ్వద్దు : ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్..
కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ తులసి దాస్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వయసులో ఉన్న యువత చెడు అలవాట్లకు త్వరగా ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ, లక్ష్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు..
ఇదే వేదిక పై.. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో పాల్గొని ఉత్తమ సేవలు అందించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విజయేందర్ రెడ్డి, మురళీమోహన్, వాసుదేవరావు, రాజేశం, రాజశేఖర్, మల్లారెడ్డితో పాటు ఇతర అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






