మాట నిలబెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి

by Disha Web Desk 2 |
మాట నిలబెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి
X

దిశ, రామన్నపేట: మండలంలోని నిదానపల్లి మల్లన్నగుట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు తన సొంత నిధులు విడుదల చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ నెల 3న ప్రకటించారు. అందులో భాగంగా మైదానం ఏర్పాటుకు రూ.2.60 లక్షలు విడుదల చేశారు. ఈ మేరకు గ్రామ పెద్దలు కలిసి కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ రాసుకున్నారు. మిగతా పనులకు త్వరలో మరిన్ని నిధులు ఎంపీ అందజేస్తారని పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మందడి శ్రీనివాస్ రెడ్డి, నల్ల వెంకట్ రెడ్డి, దేవాలయ అర్చకులు బేతోజు సత్యనారాయణ శాస్త్రి, గ్రామశాఖ అధ్యక్షుడు కొండ శేఖర్, చల్ల భిక్షం, మిరియాల భద్రయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంగల శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed