ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ సిబ్బంది

by Disha Web Desk 12 |
ఏసీబీకి పట్టుబడిన విద్యుత్ సిబ్బంది
X

దిశ, శేరిలింగంపల్లి: ఎన్నిసార్లు ఏసీబీకి చిక్కిన కొందరు విద్యుత్ శాఖ అధికారుల తీరు మారడం లేదు. అపార్ట్మెంట్ విద్యుత్ కనెక్షన్ కోసం వినియోగదారుడి వద్ద లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు ఇద్దరు సిబ్బంది. ఈ సంఘటన మాదాపూర్ ట్రాన్స్‌కో ఆపరేషన్ కార్యాలయంలో శనివారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపుర్ సాయినగర్‌లో నాగజ్యోతి ఇంటికి కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోగా లైన్ ఇన్స్‌స్పెక్టర్ ప్రభాకర్ రావు, లైన్ మెన్ సతీష్ రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు. అడిగినంత లంచం‌ ఇస్తేనే ఇంటికి కరెంట్ మీటర్ బిగిస్తామని చెప్పడంతో చేసేదేమి లేక నాగజ్యోతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఏసీబీ డీఎస్పీ సుర్యనారయణ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు మాదాపూర్ ట్రాన్స్‌కో ఆపరేషన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. నాగజ్యోతి వద్ద నుంచి జూనియర్ లైన్‌మైన్ సతీష్, లైన్ ఇన్స్ స్పెక్టర్ ప్రభాకర్ రావు డబ్బులు తీసుకునే సమయంలో నేరుగా పట్టుకున్నారు. నాగజ్యోతి ఫిర్యాదు మేరకు వారిని లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకోవడం జరిగిందని, వారి నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. డీఎస్పీ సూర్యనారాయణ కేసునమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed