- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పండగ తర్వాతే విచారణ.. హిజాబ్ వివాదంపై సీజేఐ వ్యాఖ్యలు
by Harish |

X
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో హిజాబ్ వివాదం దేశ అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. దీనిపై విచారణ హోళీ పండుగ తర్వాత చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని న్యాయవాదులు సంజయ్ హెగ్డే, దేవదుత్ కామత్ డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై హోళీ సెలవు దినాల తర్వాత విచారణ చేపడతామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. కాగా, చాలా విద్యార్థినులకు పరీక్షలు ఉన్నాయని సంజయ్ హెగ్డే వాదించారు. సోమవారం దీనిపై విచారణ చేపట్టాలని సీజేఐని కోరారు. అయితే సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. మేము తేదీని నిర్ణయిస్తాం. ఖచ్చితంగా సోమవారం మాత్రం కాదని సీజేఐ చెప్పారు.
Next Story