50 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అస్వస్థత

by Dishanational1 |
50 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు అస్వస్థత
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్లక్ష్య ధోరణితో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే కారణమని విద్యార్థులు వెల్లడించారు. యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వాటర్ పైప్ లైన్ పగలడమే కారణం అంటూ విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.


Next Story

Most Viewed