రంజాన్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం..

by Disha Web Desk |
రంజాన్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసం మొదలుకానున్న సందర్భంగా వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2 నుంచి రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో నెలవంక మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు గంట ముందే అంటే 4 గంటలకే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story

Most Viewed