- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజింగ్ - ఢిల్లీ మధ్య మళ్ళీ విమానాల రాకపోకలు: ఎయిర్ చైనా కీలక నిర్ణయం!
నాలుగేళ్ల విరామం తర్వాత బీజింగ్-ఢిల్లీ మధ్య నేరుగా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఎయిర్ చైనా ప్రకటించింది. చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా నెలలుగా క్లోజ్ అయిన బీజింగ్ - ఢిల్లీ మధ్య విమాన సర్వీస్లు (Flight services) మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భారత్- చైనా తీసుకున్న నిర్ణయం విమాన ప్రయాణికులకు ఎట్టకేలకు ఊరట లభించింది. సుమారు నాలుగు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, బీజింగ్- ఢిల్లీ మధ్య నేరుగా విమాన సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఎయిర్ చైనా (Air China) ప్రకటించింది. భారత్లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ (Yu Jing) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా రవాణా నిలిచిపోయింది. తాజాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి, బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, ఈ విమాన సర్వీసుల పునరుద్ధరణ ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా పరిగణించబడుతోంది.
ప్రస్తుతం భారత్ నుంచి చైనా వెళ్లే ప్రయాణికులు దుబాయ్, హాంకాంగ్- బ్యాంకాక్ వంటి ఇతర నగరాల మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్ (Connecting flights)లో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, టికెట్ ధరలు కూడా భారీగా ఉంటున్నాయి. ఎయిర్ చైనా డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పర్యాటకులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. త్వరలోనే ఈ విమానాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, టికెట్ బుకింగ్ వివరాలను సంస్థ వెల్లడించనుంది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మళ్ళీ పూర్వస్థితికి తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు.






