మళ్లీ అక్కడికే వచ్చా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర పోస్ట్

by Web Desk |
మళ్లీ అక్కడికే వచ్చా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర పోస్ట్
X

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. తాను ఎక్కడైతే మొదలెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానంటూ రాసుకొచ్చాడు. 2022 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ జట్టు రూ.6.25 కోట్లకు వార్నర్ ను కొనుగోలు చేసింది. అయితే, 2009 నుంచి 2013 వరకు ఢిల్లీ జట్టు తరఫున ఆడిన వార్నర్.. 2014 నుంచి సన్ రైజర్స్ జట్టు తరఫున ఆడుతూ వస్తున్నాడు. గతేడాది వార్నర్ హైదరాబాద్ జట్టు తరపున మెరుగైన ప్రదర్శన చేయని కారణంగా జట్టు యాజమాన్యం కెప్టెన్సీ తో పాటు జట్టులోకి కూడా తీసుకోలేదు. అంతేకాకుండా రిటెన్షన్ సమయంలోనూ వదిలేసింది. ఈ విషయంలో వార్నర్ తన ఆవేదనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తిరిగి ఢిల్లీ జట్టులోకి వచ్చినందుకు ఆనందంగా ఉందని, కొత్త ఆటగాళ్లను కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా రీల్స్ చేసేందుకు సలహాలు ఇవ్వాలని వార్నర్ అభిమానులను కోరాడు.



Next Story