లండన్ గ్యాలరీలో బొమ్మలుగా మారిన పర్యావరణ కార్యకర్తలు..

by Disha Web Desk |
లండన్ గ్యాలరీలో బొమ్మలుగా మారిన పర్యావరణ కార్యకర్తలు..
X

దిశ, ఫీచర్స్: ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు లండన్ గ్యాలరీలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఈ 'జస్ట్ స్టాప్ ఆయిల్' యాక్టివిస్టులు.. లండన్‌ కోవెంట్ గార్డెన్‌లోని కోర్టౌల్డ్ గ్యాలరీలోని 'విన్సెంట్ వాన్ హోగ్' పెయింటింగ్ ఫ్రేమ్‌కు తమ చేతులను స్టిక్ చేసుకుని యూనిక్‌ స్టైల్‌లో ప్రొటెస్ట్ చేశారు. 1889కి చెందిన ఈ పెయింటింగ్‌ ఫ్రాన్స్ అర్లెస్‌లోని గ్రామీణ దృశ్యానికి ప్రతీక కాగా.. ఈ అందమైన ప్రాంతం త్వరలో కరువును ఎదుర్కోబోతోందని, అక్కడ వర్షపాత స్థాయిలు సగటు కంటే 45 శాతం తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే తమ నిరసనకు వేదికగా ఈ పెయింటింగ్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

'చిన్నప్పుడు ఈ పెయింటింగ్‌ అంటే చాలా ఇష్టం. లండన్‌ను సందర్శించినప్పుడు మా నాన్న దీన్ని చూపించేందుకు నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. నేను ఇప్పటికీ ఈ పెయింటింగ్‌ను ప్రేమిస్తున్నాను. కానీ దీనికంటే ఎక్కువగా నా స్నేహితులు, కుటుంబం, ప్రకృతిని ప్రేమిస్తున్నాను. ప్రజాప్రతిష్ట కంటే భవిష్యత్తు మనుగడకు ఎక్కువ విలువ ఇస్తాను' అని పేర్కొన్న యాక్టివిస్ట్ .. 'యూకే ప్రభుత్వం కొత్తగా 40కి పైగా శిలాజ ఇంధన ప్రాజెక్ట్‌లు ప్రారంభించనుంది. సర్కార్ ఈ ప్రాజెక్ట్ ఆమోదించిందంటే.. మన మరణ వారెంట్లపై సంతకం చేసినట్లే' అని వివరించారు. వెంటనే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లను విరమించుకోవాలని కోరిన పర్యావరణ కార్యకర్తలు.. అన్ని కళాసంస్థలు తమతో కలిసి రావాలని పిలుపునివ్వడమే ఈ నిరసన లక్ష్యమని తెలిపారు.



Next Story

Most Viewed