Telangana: పెరిగిన రాముని ప్రసాదాల రేట్లు..!

by Disha Web Desk 12 |
Telangana: పెరిగిన రాముని ప్రసాదాల రేట్లు..!
X

దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వివిధ రకాల ప్రసాదాల రేట్లు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. చిన్న లడ్డు 100 గ్రాములు రూ.20 నుంచి రూ.25 కు, మహా లడ్డు 500 గ్రాములు ఇది వరకు రూ.100 రూపాయలకు విక్రయించగా దానిని 400 గ్రామాలకు కుదించి అదే 100 రూపాయల ధర కేటాయించారు. పులిహోర 200 గ్రాముల ప్యాకెట్ రూ.10 నుంచి రూ.15 కు పెంచారు. చక్కెర పొంగలి 100 గ్రాములు రూ. 10 నుంచి రూ.15 కి, కేశఖండన టికెట్ రూ.15 నుంచి రూ.20 కి పెంచుతూ.. దేవస్థానం నిర్ణయం తీసుకుంది.



Next Story

Most Viewed