వెస్టిండీస్‌ టూర్‌కు భారత టీ20 జట్టు ఇదే..

by Disha Web Desk 12 |
BCCI Announces India Squad for T20 Series Against West Indies
X

దిశ,వెబ్‌డెస్క్: BCCI Announces India Squad for T20 Series Against West Indies| వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును గురువారం ప్రకటించింది. ఈ టీ20 సిరీస్‌‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 29 నుండి ప్రారంభమవుతుంది. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ జట్టులో స్థానం కల్పించింది. అంతేకాక ఫిట్‌నెస్‌కు లోబడి కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌ల టీంలో చేరిక ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. స్పిన్నర్ రవీచంద్రన్ అశ్విన్‌కు మరో అవకాశం కల్పించింది.

టీమిండియా జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.

Also Read: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. వెస్టిండీస్ గడ్డపై


Next Story

Most Viewed