గిరిజన మహిళపై అత్యాచారయత్నం

by Disha Web Desk 13 |
గిరిజన మహిళపై అత్యాచారయత్నం
X

దిశ, కరకగూడెం: ఓ వివాహితపై అత్యాచారయత్నం చేయబోయిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన బుధవారం కరకగూడెం మండలం లో చోటుచేసుకుంది. కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కౌలురు గ్రామానికి చెందిన రామగాని సందీప్ అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన ఓ గిరిజన వివాహితను ఈ నెల 2వ తారీఖున రాత్రి వేళలో, ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవంతం చేయబోయాడు. ఈ క్రమంలో సదరు మహిళ కేకలు వేయడంతో సందీప్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమై బుధవారం కరకగూడెం పోలీస్ స్టేషన్ లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సందీప్ అనే వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మణుగూరు ఏఎస్పీ శబరిష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed