లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో.. యువకుడు మృతి

by Web Desk |
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో.. యువకుడు మృతి
X

దిశ, రామాయంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన రామాయంపేట శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన భాను చందర్ రెడ్డి (25) పని నిమిత్తం బస్వాపూర్ నుంచి తన బైక్ పై హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ క్రమంలో రామాయంపేట శివారులోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వస్తున్న లారీ డ్రైవర్, బైక్ ను ఎడమ పక్కన నుంచి ఢీకొట్టాడు.

దీంతో బైక్ పైనున్న భానుచందర్ రెడ్డి కిందపడగా, లారీ వెనుక టైర్లు అతని తలమీదుగా వెళ్లాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా భాను చందర్ రెడ్డి తల్లిదండ్రులు చిన్నతనంలో మృతి చెందగా మేనమామ నర్సింహరెడ్డి పెంచుకున్నాడు. మృతుని మేనమామ నరసింహ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed