దారుణం: మొక్కజొన్న సొప్పకు నిప్పు పెడుతుండగా..

by Disha Web Desk 13 |
దారుణం: మొక్కజొన్న సొప్పకు నిప్పు పెడుతుండగా..
X

దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మొక్కజొన్న సొప్పకు నిప్పు పెడుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ఆ మంటలోనే పడి సజీవదహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం గ్రామానికి చెందిన బుర్క సారయ్య(80) మొక్కజొన్న చేను వేశాడు. ఈ మధ్యనే ఆ చేను పని కూడా పూర్తయింది. ఈ క్రమంలో పంట చేను శుభ్రం చేసుకోవడానికి మొక్కజొన్న సొప్పకు నిప్పు అంటించడానికి సిద్ధమయ్యాడు. అయితే నిప్పు పెట్టిన కొద్ది సేపటికే గాలి బలంగా తను ఉన్న వైపు వీయడంతో.. పొగ కారణంగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మంటలు చెలరేగడంతో సారయ్య ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. సారయ్య మృతితో జంగవాని గూడెం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.




Next Story

Most Viewed