- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం: మొక్కజొన్న సొప్పకు నిప్పు పెడుతుండగా..
by Disha Web Desk 13 |
X
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో దారుణం చోటుచేసుకుంది. మొక్కజొన్న సొప్పకు నిప్పు పెడుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ఆ మంటలోనే పడి సజీవదహనమయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడ మండలంలోని జంగవానిగూడెం గ్రామానికి చెందిన బుర్క సారయ్య(80) మొక్కజొన్న చేను వేశాడు. ఈ మధ్యనే ఆ చేను పని కూడా పూర్తయింది. ఈ క్రమంలో పంట చేను శుభ్రం చేసుకోవడానికి మొక్కజొన్న సొప్పకు నిప్పు అంటించడానికి సిద్ధమయ్యాడు. అయితే నిప్పు పెట్టిన కొద్ది సేపటికే గాలి బలంగా తను ఉన్న వైపు వీయడంతో.. పొగ కారణంగా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మంటలు చెలరేగడంతో సారయ్య ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. సారయ్య మృతితో జంగవాని గూడెం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story