హైదరాబాద్‌లోని ఆ హోటల్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు!

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లోని ఆ హోటల్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ వేళ కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఇవాళ సాయంత్రమే అభ్యర్థులందరినీ హైదరాబాద్‌కు రప్పించనున్నారు. అంతేకాదు.. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో అభ్యర్థులకు ఏఐసీసీ ప్రత్యేక ప్రతినిధుల బృందం కీలక దిశానిర్దేశం చేయనుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇప్పటికే నగరానికి చేరుకున్నట్లు సమాచారం. డీకే శివకుమార్‌తో పాటు కర్ణాటక మంత్రులు జార్జ్, బోసురాజు, స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా నగరానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. దీంతో దాదాపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.



Next Story

Most Viewed