అన్నా మీరు ఎంట్రీ ఇవ్వాల్సిందే.. డీకేను కోరిన రేవంత్

by Disha Web Desk 2 |
అన్నా మీరు ఎంట్రీ ఇవ్వాల్సిందే.. డీకేను కోరిన రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన డీకే శివకుమార్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం బెంగళూరులో ప్రత్యేకంగా కలిశారు. అతి త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి ఇద్దరు పీసీసీ చీఫ్‌లు చర్చించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను నియోజకవర్గాల వారీగా వివరించినట్లు సమాచారం. ఇక న్యూ జాయినింగ్స్‌పై కూడా డిస్కషన్స్ చేశారు. తుమ్మల చేరిక కన్ఫామ్​అయిందని, అతి త్వరలో మరో 15 మంది కీలక నేతలు పార్టీలో చేరుతున్నట్లు రేవంత్ డీకేకు చెప్పినట్లు తెలిసింది.

అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలను, యాక్షన్ ప్లాన్‌లను డీకే రేవంత్‌కు సూచించినట్లు తెలుస్తోన్నది. ఈ నేపథ్యంలో “అన్నా మీరు తెలంగాణపై ఫోకస్ పెట్టాలి. కచ్చితంగా హైదరాబాద్‌లోనే మకం వేయాల్సి ఉంటుంది” అని రేవంత్ డీకేను రిక్వెస్టు చేయగా.. ఆయన ఓకే చెప్పినట్లు రేవంత్ సన్నిహితులు తెలిపారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుతోనూ డీకే ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.



Next Story

Most Viewed