- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
by Disha Web Desk 2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై రూ.90 కోట్లకు మై హోం రామేశ్వర్ రావు ఈ పరువు నష్టం దావా వేశారు. కాగా, సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి ఇవాళ కొట్టివేసింది. అయితే ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. కాగా, 2014 నాటి దావాలో తాజాగా తీర్పు రావడం రేవంత్ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది.
Next Story