ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలు.. అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు

by Disha Web Desk 2 |
ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతలు.. అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మరోవైపు బీఎస్పీ పార్టీ కూడా తన మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ తన అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ ప్రకాష్ జవదేకర్ నివాసంలో బీజేపీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై నేతలు తుది కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముందుకు ఫైనల్ లిస్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం.

Next Story