ప్రచారం చేసుకోండి.. బీజేపీ అభ్యర్థులను హైకమాండ్ నుంచి ఫోన్లు

by Disha Web Desk 2 |
ప్రచారం చేసుకోండి.. బీజేపీ అభ్యర్థులను హైకమాండ్ నుంచి ఫోన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అభ్యర్థుల జాబితాపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అధికారికంగా జాబితాను ప్రకటించకపోయినా.. పలువురు అభ్యర్థులకు మాత్రం ప్రచారం చేసుకోవాలని ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. తమకు అసెంబ్లీ టికెట్ ఖరారైందని, ఆయా నియోజకవర్గాలల్లో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని పలువురు ముఖ్య నేతల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థులకు స్వయంగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జీ ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఇన్ చార్జీలు సునీల్ బన్సల్ ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెబుతున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed