ప్రచారం స్టైల్ మార్చిన తెలంగాణ మంత్రులు.. కార్యకర్తల్లో నయా జోష్ (వీడియోస్)

by Disha Web Desk 2 |
ప్రచారం స్టైల్ మార్చిన తెలంగాణ మంత్రులు.. కార్యకర్తల్లో నయా జోష్ (వీడియోస్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు వినూత్న రీతిలో ప్రచారం చేపడుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్థులు ప్రచార పర్వంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షెహరీలు వినిపిస్తూ డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు.

ఇటీవల ఓ టాలీవుడ్ సినిమా మేకర్ సైతం తమ మూవీ ప్రమోషన్ కోసం ఇటువంటి స్ట్రాటజీనే ఎంచుకుని సక్సెస్ కాగా ప్రస్తుతం ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ‘నవంబర్ 30న చేతి వేలికి ఇంక్.. ఆ తర్వాత తెలంగాణ మొత్తం పింక్' అంటూ షెహరీ వినిపించి డ్యాన్స్ కార్యకర్తలను జోష్ లోకి నింపగా ఈ వీడియో వైరల్ అయింది. దీంతో బీఆర్ఎస్ లోని మిగతా అభ్యర్థులూ ఇదే ఫాలో అవుతున్నారు. ఇక బీఆర్ఎస్‌కు కౌంటర్‌గా బీజేపీ సోషల్ మీడియా సైతం ఇదే తరహా ప్రచారం నిర్వహిస్తోంది. 'మా సీఎం చంద్రశేఖర్ రావు.. కేసీ రావుకు ఓట్లేస్తే ఉద్యోగాలు రావు' అంటూ కౌంటర్లు వేస్తోంది.

Next Story

Most Viewed