ఈటల రాజేందర్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారేమో

by Disha Web Desk 2 |
ఈటల రాజేందర్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారేమో
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పని ఖతం అయిపోయిందని.. రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని.. సర్వే రిపోర్టులు చూసి ఆగమాగం కావొద్దని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మనమే అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై ఎక్కడా వ్యతిరేకత లేదని అన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారేమో అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీటీమ్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీది ఆలూమగల బంధం అని విమర్శించారు. ప్రవళిక మృతిని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దుర్మార్గులు రాష్ట్రంలో ఉన్నారని సీరియస్ అయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed