బీసీ లీడర్లపై హైకమాండ్ సీరియస్.. ఇవాళ్టి ధర్నా రద్దు

by Disha Web Desk 2 |
బీసీ లీడర్లపై హైకమాండ్ సీరియస్.. ఇవాళ్టి ధర్నా రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ.కాంగ్రెస్ బీసీ నేతలు ఇవాళ గాంధీ భవన్‌లో తలపెట్టిన ధర్నాను రద్దు చేసుకున్నారు. టికెట్ల ప్రకటనకు ముందు ఈ ధర్నాలు ఏంటని ఏఐసీసీ పెద్దల మందలింపుతో తమ నిర్ణయాన్ని బీసీ నేతలు వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో బీసీలకు సముచిత సంఖ్యలో టికెట్లు కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్లు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గాంధీ భవన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపడతామని నిన్న బీసీ నేతలు ప్రకటించారు. ఓవైపు ఇవాళ ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీల భేటీ ఉండగా బీసీ నేతల ఆందోళన ప్రకటనపై ఏఐసీసీ పెద్దలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో ధర్నాను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed