- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BCల దమ్ము ఏంటో చూపిస్తాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
దిశ, వెబ్డెస్క్: BCల దమ్ము ఏంటో చూపిస్తా్ం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేవెళ్ళలో బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బలహీన వర్గాలకు చెందిన వారన్నారు. 30, 40 యేండ్ల నుంచి బీసీ హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మాత్రమే చేవెళ్లలో బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిందన్నారు. బీసీలను కించపరుస్తూ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి వీడియో పెట్టారని ఫైర్ అయ్యారు. దీన్ని బీసీలు సవాల్గా తీసుకోవాలన్నారు. దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మోహన్ రెడ్డి సవాల్ చేశారని.. డబ్బులకు బీసీలు లొంగుతారని ఆయన దుర్మార్గంగా మాట్లాడారన్నారు. మోహన్ రెడ్డి కుల దురహంకారాన్ని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంతవరకు ఖండించలేదన్నారు. బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి.. నిద్ర పోతున్నాయా ? అని ప్రశ్నించారు.
బీసీ సంఘాలు నిద్ర లేవాలి ..ఇంటింటికి వెళ్లి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల దమ్ము ఏమిటో చూపిస్తామన్నారు. పార్టీల కతీతంగా కాసానికి మద్దతు తెలిపేందుకు అన్ని వర్గాలు ముందుకు వస్తున్నాయన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నా అని క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ను గతంలో కలిసింది. మర్యాద పూర్వకంగానే అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. బీఆర్ఎస్లో సంతృప్తిగా ఉన్నా అన్నారు. కేసీఆర్ తెలంగాణను పదేళ్లలో రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్కు ప్రజలు ఈ ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కేసీఆర్ తోనే భవిష్యత్లో కూడా పయనిస్తా అని తేల్చిచెప్పారు.