Medaram Jatara 2026: పెరిగిన రద్దీ.. మేన్ గేటుకే మొక్కులు

by Ajay Maddhiboyina |

సమ్మక్క గద్దె చేరడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు.

Medaram Jatara 2026: పెరిగిన రద్దీ.. మేన్ గేటుకే మొక్కులు
X

దిశ, మేడారం నెట్ వర్క్ : సమ్మక్క గద్దె చేరడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు సమ్మక్క సారలమ్మ ప్రధాన ద్వారం వద్దనే తమ మొక్కులు చెల్లించి తమను చల్లగా చూడాలంటూ వేడుకుంటున్నారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువై ఉండడంతో సాదారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ భక్తుల తాకిడితో పాటు జాతరలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కుటుంబాలు సైతం వనదేవతల దర్శణానికి రావడంతో భక్తులకు దర్శణబాగ్యం భారమైన నేపథ్యంలో చాలా మంది తమ మొక్కులు ప్రధాన గేటుకే సమర్పిస్తున్నారు.

Next Story