మ‌ద్యానికి బానిసై వీఆర్ఏ ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి చెరువులో ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌లంలోని మ‌చ్చాపురంలో చోటు చేసుకుంది.

మ‌ద్యానికి బానిసై వీఆర్ఏ ఆత్మ‌హ‌త్య
X

దిశ‌, గీసుకొండ : మ‌ద్యానికి బానిసై వ్య‌క్తి చెరువులో ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న మండ‌లంలోని మ‌చ్చాపురంలో చోటు చేసుకుంది. సీఐ విశ్వేశ్వ‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన మొగసాని లక్ష్మణ్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. వృత్తి రీత్యా గ్రామ వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఇంట్లో గొడవలు గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం లక్ష్మణ్ బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడని తన బార్య, తండ్రి కనకయ్య మందలించారని, మద్యం మత్తులో గంగదేవిపల్లి చెరువులో పడి మృతి చెందాడ‌ని తండ్రి కనకయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story