నేడు నృసింహునికి ‘వరపూజ’

by Ratna Kumari |

సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని హేమాచల లక్ష్మీనృసింహాస్వామికి చెంచులక్ష్మీతో వరపూజ(పప్పన్నం) మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో రేవెల్ల మహేష్ తెలిపారు.

నేడు నృసింహునికి ‘వరపూజ’
X

దిశ, మంగపేట : సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకొని హేమాచల లక్ష్మీనృసింహాస్వామికి చెంచులక్ష్మీతో వరపూజ(పప్పన్నం) మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో రేవెల్ల మహేష్ తెలిపారు. మల్లూరు గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగనంలోని విశ్రాంతి మండపంలో దేవాదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన కల్యాణ వేధికలో మకర సంక్రమణ ఉత్తరాయణ కాలంలో గురువారం లక్ష్మీనృసింహునికి చెంచులక్ష్మీ, ఆదిలక్ష్మీ అమ్మవార్లకు గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ అర్చకులు వరపూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

Next Story