పురుగుల మందు తాగి ఇద్దరు మహిళల ఆత్మహత్య..

by Disha Web Desk 11 |
పురుగుల మందు తాగి ఇద్దరు మహిళల ఆత్మహత్య..
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ములుగు జిల్లా పరిధి తాడ్వాయి మండలంలో ఇద్దరు మహిళలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని భూపతిపూర్ గ్రామ సమీపంలో ఉన్న గుత్తి కోయగూడెంకు చెందిన పూనెం దేవి, పోదెం భీమ్లా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed