మహబూబాబాద్ రైల్వే‌ స్టేషన్‌లో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి

by Shiva |
మహబూబాబాద్ రైల్వే‌ స్టేషన్‌లో విషాదం.. గుండెపోటుతో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ రైల్వే‌ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం రాంబాబు అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రాంబాబు ఛాతిలో నొప్పి అంటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కంగారు పడిన అతడి భార్య కేకలు వేయగా.. స్థానికులు వచ్చి అతడికి సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో రాంబాబు స్పాట్‌లోని చనిపోయాడు. అయితే, రాంబాబుకు గుండెపోటు రాగా సాటి ప్రయాణికులు అతడికి సీపీఆర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed