అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృత దేహం లభ్యం..

by Bhanu |

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృత దేహం లభ్యం..
X

దిశ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన మంద సారయ్య గ్రామ శివారులోని వాగు వద్ద మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Next Story