జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

by Bhanu |

స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, జనగామ : స్టేషన్ ఘనపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ పరిధిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




Next Story