అగ్నిప్రమాదంలో ఆస్తి దగ్దం

by Elthuri vijay kumar |

కాలిపోయిన గృహోపకరణాలు

అగ్నిప్రమాదంలో ఆస్తి దగ్దం
X

అగ్నిప్రమాదంలో ఆస్తి దగ్దం

- కాలిపోయిన గృహోపకరణాలు

- ప్రమాదంలో రూ.2లక్షల ఆస్తి నష్టం

- బోరున విలపిస్తున్న బాధిత కుటుంబం

దిశ, మహదేవపూర్ : మహదేవపూర్ మండలం కుదురుపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి భారీ ఆస్తినష్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్ల దేవేందర్‌ ఇంట్లో రాత్రి 2:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నికీలల్లో ఆయన జీవనోపాధిగా నడుపుతున్న పిండి గిర్ని, కారం గిర్ని, బియ్యం గిర్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిని నడిపే మోటార్‌తో పాటు ఇంట్లో ఉన్న దర్వాజలు, కుర్చీలు, రేకులు, వర్క్ కవర్ పట్టాలు, విద్యుత్ తీగలు అన్నీ కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దగ్దమైన ఆస్తి విలువ దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు బోరున విలపించాడు. జీవనోపాధి కోల్పోయిన తాను కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా అన్న ఆందోళనలో ఉన్నట్లు చెప్పాడు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని దేవేందర్‌ వేడుకొన్నారు.

Next Story