పిడుగుపాటుతో వ్యక్తి మృతి..

by Bhanu |

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలో చోటుచేసుకుంది.

పిడుగుపాటుతో వ్యక్తి మృతి..
X

దిశ, గూడూరు: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలో చోటుచేసుకుంది. గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుండెంగ గ్రామానికి చెందిన మైదం ప్రభు (38) బుధవారం మధ్యాహ్నం సమయంలో వర్షం పడుతుండగా గ్రామంలోని రైతు వేదిక వద్ద నుండి రోడ్డుపై ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


Next Story