రామప్పను సందర్శించిన మాల్దీవులకు చెందిన అడిట్ అఫిషియల్స్

by Bhanu |

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంను మాల్దీవులకు చెందిన అడిట్ అఫిషియల్స్ సందర్శించారు.

రామప్పను సందర్శించిన మాల్దీవులకు చెందిన అడిట్ అఫిషియల్స్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంను మాల్దీవులకు చెందిన అడిట్ అఫిషియల్స్ సందర్శించారు. మాల్దీవులకు చెందిన అడిట్ అఫిషియల్స్ ఎన్ ఐ ఆర్ డి హైదరాబాద్ లో శిక్షణ పోందుతున్న శిక్షణ లో భాగంగా రామప్ప దేవాలయం ను సందర్శించగా వారికి ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళా ప్రాముఖ్యతను టూరిజం గైడ్ వివరించారు. అనంతరం రామప్ప సరస్సు ను సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఎన్ ఐ ఆర్ డి ట్రైనింగ్ మేనేజర్ లు శిరిష , అరుణ్ రాజు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ లు ఉపేందర్, రాజేందర్, వరంగల్ డిఆర్డిఏ అదికారి సురేష్, ఎన్ ఐ ఆర్ డి శేఖర్, తదితరులు ఉన్నారు.


Next Story