- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరుకుళ్ళ ఇళ్ల పట్టాలలో భారీ అవకతవకలు
హనుమకొండ జిల్లా ఆత్మ కూర్ మండలం నీరుకుళ్ళ గ్రామంలో నిరుపేదల ఇళ్ల స్థలాల వ్యవహారంలో భారీ అవకతవకలు చేసుకుంటున్నాయి.

నిబంధనలు గాలికి..
నిబంధనల ప్రకారం ఒకసారి కేటాయించిన ప్లాట్ సైజును మార్చాలన్నా లేదా తొలగించాలన్న ముందస్తుగా లబ్ధిదారునికి షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవడం తప్పనిసరి. కానీ నోటీసులు ఇవ్వకుండా పాత లబ్ధిదారుల అనుమతి లేకుండా ప్లాట్ల సరిహద్దుల ను మార్చడం పూర్తిగా చట్ట విరుద్ధం. పాత వారి స్థలాన్ని లాక్కొని కొత్త వారికి ఇవ్వడం ఏరకంగా సమంజసం కాదని బాధితులు గ్రామ ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే ప్రమేయంతోనే అక్రమాలు....
స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోయిన కొందరు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఈ అవకతవకలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. తమ రాజకీయ అనుచరులను కొత్తవారిని ప్రసన్నం చేయడం కోసం దశబ్దాలుగా ఇల్లస్థలాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నోరు కొడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై నోరు విప్పితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని పేద ప్రజలు లబ్ధిదారులు భయపడుతున్నారు.






