ఉద్యోగులు సామాజిక బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్

by Disha Web Desk 11 |
ఉద్యోగులు సామాజిక బాధ్యతగా పనిచేయాలి: ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
X

దిశ, నర్సింహులపేట: ఉద్యోగులు తమ విధులను సామాజిక బాధ్యతగా గుర్తించి పనిచేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మిషన్ భగీరథ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేస్తూ పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, తహశీల్దార్ వివేక్, వైస్ ఎంపీపీ దేవేందర్, పీఎసీఎస్ చైర్మన్ సంపెట రాము, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ మదుసుధన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మెరుగు శంకర్, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


Next Story