బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం

by velandi.Saikiran |

భూపాల్ పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
X

దిశ, భూపాలపల్లి: భూపాల్ పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రిలో పరామర్శించి అనంతరము పాఠశాలకు వెళ్లి విద్యార్థులను సంఘటన విషయమై తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తమకు ఎదురు అవుతున్న ఇబ్బందులను గండ్ర సత్యనారాయణరావుకు వివరించారు స్టూడెంట్స్. ఉపాధ్యాయులు దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అనంతరం గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఉపాధ్యాయులను ఉపేక్షించేది లేదన్నారు.

Next Story