మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. ఊరికి పిలిపించి కొట్టిన గ్రామస్తులు

by Web Desk |
మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. ఊరికి పిలిపించి కొట్టిన గ్రామస్తులు
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘన్పూర్ మండలం అప్పన్నపల్లి గ్రామంలో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. శుక్రవారం రోజు గుర్రం రమేష్ అనే యువకుడు విద్యుత్ మీటర్ రీడింగ్ తీసుకోవడానికి అప్పుయ్యపల్లి గ్రామానికి చేరగా ఓ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటాన్ని చూశారు. ఇదే అదనుగా భావించి మైనర్‌పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె సోదరులు చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతన్ని ఓ మధ్యవర్తి ద్వారా శనివారం పిలిపించి పంచాయతీ చేయగా కోపొద్రోధికులైన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story