- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండాలో అరుదైన ఘటన.. ఉపాధ్యాయుడితో కలిసి డిప్యుటేషన్!
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

దిశ, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థి రితీశ్ మాత్రమే మిగలడంతో, ఆ విద్యార్థిని హెడ్మాస్టర్ శ్రీనివాస్తో కలిసి సమీపంలోని కల్వల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు డిప్యుటేషన్పై తరలించినట్లు సమాచారం. దీంతో క్యాంపు తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం పడింది. విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ, విద్యా హక్కు చట్టం (RTE) స్ఫూర్తికి విరుద్ధంగా పాఠశాలను మూసివేశారని పలువురు విమర్శిస్తున్నారు. మారుమూల తండాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన సమయంలో, ఉన్న ఒక్క విద్యార్థినే మరో పాఠశాలకు తరలించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి, తగిన వివరణ ఇవ్వాలని గ్రామస్థులు, విద్యా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.






