వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం..

by Disha Web Desk 11 |
వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం..
X

దిశ, కరీమాబాద్: వరంగల్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్‌ ఆవరణలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశాడు. అయితే అదేసమయంలో అక్కడికి వచ్చిన రైల్వే పోలీసులు అతడిని పట్టుకొని, అతడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై వరంగల్ ఎస్‌బీఐ చీప్ మేనేజర్ విలియం కేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇంతెజర్ గంజ్ ఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Next Story