- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బంపర్ ఆఫర్: కేవలం రూ.59కే బిర్యానీతో పాటు.. ఎగబడి మరీ తింటోన్న జనాలు!
దిశ, వెబ్డెస్క్: సాధారణంగా బిర్యానీ అనగానే లొట్టలేసుకుంటూ తినేవారు 99 శాతం మంది ఉంటారు. కొంతమందికైతే ప్రతిరోజూ బిర్యానీ తిన్నా బోర్ కొట్టరు. ప్రస్తుత రోజుల్లో పలు ఈవెంట్లలో కూడా బిర్యానీ పెట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీకి కాస్త ఖరీదు ఎక్కువే ఉంటుంది మరీ. కొన్ని హోటళ్లలో కాస్ట్ ఎక్కువైన రుచి అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే హనుమకొండ జిల్లాలోని ఓ మహిళ స్వయం ఉపాధి పొందాలన్న ఉద్ధేశంతో ఒక బిర్యానీ పాయింట్ పెట్టిందట. అంతేకాకుండా ఆమెనే స్వయంగా వంటచేసి విక్రయిస్తోందట. మరీ ఈ మహిళ అమ్మే బిర్యానీకి ఎంతనుకుంటున్నారు. కేవలం రూ. 59 రూపాయలు మాత్రమే. ఇందులోనే ఉడికించిన కోడిగుడ్డు కూడా ఫ్రీగానే ఇస్తుందట. ఈమె రోజుకు 50 కేజీల బిర్యానీ వండుతుందట. ప్లేట్ బిర్యానీకి రూ. 59 అంటే మరీ నాణ్యతలో ఏమైన లోపం ఉంటుందని అనుకుంటున్నారేమో. కానీ రుచి కూడా సూపర్గా ఉంటుందట. బిర్యానీ రుచిగా ఉండటంతో అతితక్కువ సమయంలోనే రెగ్యులర్ కస్టమర్లు పెరిగారు. రోజుకు 3 వేల నుంచి 4 వేల వరకు ఆదాయం వస్తుందట. అలాగే 69 రూపాయలకే ఫ్రైడ్ చికెన్ పీస్ అందిస్తుందట. ఈ వార్త విన్న జనాలు.. కుమారి ఆంటీ లెవల్లో మీరు అంత ఫేమస్ అవ్వాలి. మీ బిజినెస్ బాగా నడాలంటూ ఆమెకు సపోర్ట్గా కామెంట్లు చేస్తు్న్నారు.