CM రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి.. అర్వింద్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
CM రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి.. అర్వింద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలన్నారు. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయం అయ్యారన్నారు. మోడీని బడే భాయ్ అన్నందుకు రేవంత్‌పై రాహుల్ గాంధీ కక్షకట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కన వాళ్లే చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్వింద్ సూచించారు.

Next Story