దసరా పండుగ పూట విషాదం.. ముగ్గురు మృతి

by Dishafeatures2 |
దసరా పండుగ పూట విషాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వర్థన్నపేట: దసరా పండుగ పూట బుధవారం వరంగల్ వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.విజయదశమి సందర్భంగా గ్రామ శివారులో మిత్రులు ఐదుగురు కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో ఒక్కసారి గా పిడుగు పడటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.పిడుగు పడి సాంబరాజు శివ క్రిష్ట సాయి మృత్యువాత పడ్డారు. దసరా పండగ మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.


Next Story

Most Viewed