కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు

by Disha Web Desk 4 |
కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 71వేల మందికి వర్చువల్ గా ప్రధాని మోడీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 12 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ ఎందులో ముందుందో అందరికీ తెలుసన్నారు. అవినీతి, నియంతృత్వం, అహంకార కుటుంబ మాఫియా పాలనలో, లిక్కర్ స్కాం కేసుల్లో ముందుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా మాట్లాడుతూ.. తొండి ఆట ఆడుతుందన్నారు. ఉద్యోగ నియామకాలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. మీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదన్నారు.



Next Story