అంబర్ పేట్‌లో కుక్కలు విపరీతంగా పెరగడానికి కారణం అదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
అంబర్ పేట్‌లో కుక్కలు విపరీతంగా పెరగడానికి కారణం అదే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: అంబర్ పేట్‌లో ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. సోమవారం అంబర్ పేట్‌లోని ప్రదీప్ ఇంటికెళ్లిన కిషన్ రెడ్డి బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సర్కార్‌పై ఫైర్ అయ్యారు. అంబర్ పేట్‌లో వీధి కుక్కలు పెరగడానికి కారణం సర్కార్ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుండో కుక్కలను పట్టుకువచ్చి అంబర్ పేట్‌లో వదిలేస్తున్నారన్నారు. సంతాన నియంత్రణ ఆపరేషన్ల పేరుతో కుక్కలను అంబర్ పేట్‌కు తీసుకొస్తున్నారని.. ఆపరేషన్ల తర్వాత ఇక్కడే కుక్కలను వదిలేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే అంబర్ పేట్‌లో కుక్కలు విపరీతంగా పెరిగిపోయానన్నారు.



Next Story

Most Viewed