మేడే రోజున తీవ్ర విషాదం.. ‘ఉపాధి పని’కి వెళ్లి కార్మికుడు మృతి

by Disha Web Desk 2 |
మేడే రోజున తీవ్ర విషాదం.. ‘ఉపాధి పని’కి వెళ్లి కార్మికుడు మృతి
X

దిశ, బల్మూర్: ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి కార్మికుడు కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం గోదల్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటయ్య(45) అనే వ్యక్తి రోజూ లాగే సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిచేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో కన్నుమూశాడు. ఆయనకు భార్య రజిత, కూతురు నాగలక్ష్మి, కుమారుడు నాగరాజు ఉన్నారు.



Next Story

Most Viewed