విషాదం.. కొడుకు మృతి తట్టుకోలేక తల్లి..

by Disha Web Desk 4 |
విషాదం.. కొడుకు మృతి తట్టుకోలేక తల్లి..
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నపేగు ఆ కొడుకు కోసం తల్లడిల్లింది. చేతికందిన కొడుకు చనిపోవడంతో కుంగిపోయిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మీరాజం, రాజగంగు(53) దంపతులకు ఇద్దరు కూతుళ్ల, ఒక కుమారుడు శివకుమార్ (23) ఉన్నారు.

కూతుళ్లకు వివాహం కాగా కుమారుడు మూడు నెలల కిందట సూసైడ్ చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం భర్త లక్ష్మీరాజం దుబాయ్ వెళ్లగా రాజగంగు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. కొడుకు మరణంతో కుంగిపోయిన రాజగంగు గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కూతుళ్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో బంధువులతో కలిసి గ్రామంలో వెతికారు. గ్రామానికి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story