బ్రేకింగ్: భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న రేవంత్.. ఈటల ఎక్కడున్నారంటే..?

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న రేవంత్.. ఈటల ఎక్కడున్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ నుండి రూ.25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి.. ఈటలకు సవాల్ విసిరారు. తాను బీఆర్ఎస్ నుండి రూ. 25 కోట్లు తీసుకున్నానని ఆరోపించిన ఈటల.. భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుండి తాను 25 కోట్లు తీసుకోలేదని తడి బట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేస్తానని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు.

కాగా, చెప్పినట్లుగానే భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి బయలుదేరారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుండి భారీ కాన్వాయ్‌తో రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై ఇప్పటి వరకు ఈటల రాజేందర్ స్పందించలేదు. అయితే, రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు బయలుదేరడంతో.. ఈటల రాజేందర్ ఎక్కడున్నారని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈటల రాజేందర్ మాత్రం ఆయన నివాసంలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన ఈటల.. వారితో చర్చిస్తున్నారు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల హాజరుపై సస్పెన్స్ వీడింది.



Next Story

Most Viewed