ఆరోపణలు చేసిన వారు.. ఆలయానికి రావాలి: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

by Disha Web Desk 19 |
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నుండి రూ.25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బయలుదేరారు.హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుండి కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కు భారీ కాన్వాయ్‌తో రేవంత్ రెడ్డి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఇంటి నుండి బయలుదేరే ముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అన్ని విషయాలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దే మాట్లాడుతానని తెలిపారు.

తనపై ఆరోపణలు చేసిన వారు.. తన సవాల్‌ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు అమ్మవారి ఆలయం వద్దకు రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక, రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బయలు దేరిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయన వస్తారా.. రారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Next Story