ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్

by Disha Web Desk 9 |
ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయని ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్​ లో ఉన్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​పేర్కొన్నారు. సీఎస్​, సీఎం దృష్టికి సమస్యలు వెళ్లినా పరిష్కారం కావట్లేదన్నారు. దీంతోనే ధరణి ఇష్యూలపై హెచ్​ఆర్సీలో ఫిర్యాదు చేశామన్నారు. గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్​అధికారంలోకి రాగానే ధరణిని రద్ధు చేస్తామన్నారు.కాంగ్రెస్ భూములు పంచితే.. బీఆర్​ఎస్​వాటిని ఆక్రమిస్తుందని ఆరోపించారు. భూదాన్​భూములను హెచ్​ఎండీఏ అమ్ముకుంటుందన్నారు. ధరణి తో ఇబ్బంది పడుతున్న వారంతా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనాలలో నిలదీయాలన్నారు. రైతులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నిజమైన హక్కు దారులలో చాలా మందికి ధరణి లో లబ్ది జరగలేదన్నారు. సమస్య ఉందని తెలిసినా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. త్వరలోనే ధరణిపై కాంగ్రెస్​పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందన్నారు.



Next Story

Most Viewed